ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ 

Published on

-Advertisement-

తలమడుగు, మన భారత్:
తలమడుగు మండల కేంద్రంలో మండల స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధికారులు లబ్ధిదారులకు వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలు, అర్హతలు, దరఖాస్తు విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేసి తమ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ఉన్నతాధికారులు, యువత మరియు గ్రామ పెద్దలు భారీగా పాల్గొన్నారు. తలమడుగు సర్పంచ్ రాజన్న, ఎమ్మార్వో రాజమోహన్, ఎంపీడీవో శేఖర్, ఎస్సై రాధిక తదితరులు కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

ప్రతికూలతల మధ్య అవకాశాల సృష్టి – జీవన పాఠం

మన భారత్, ఇంటర్ నెట్ డెస్క్: కాంక్రీటు నేలపై మొలకెత్తిన చిన్న మొక్క కూడా మనిషికి గొప్ప జీవన సందేశాన్ని...

More like this

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...