మన భారత్, ఆంధ్రప్రదేశ్:
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలోని ముఖ్యమైన ప్రదేశాలు, మార్గాలకు మరింత ఆధ్యాత్మికతను చేకూర్చేలా ప్రత్యేక నామకరణానికి శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధులకు నాలుగు వేదాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. అవి రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేద పేర్లతో ప్రసిద్ధి చెందనున్నాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు మరింత ధార్మిక ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.
ఇక శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే మార్గానికి విజయనగర సామ్రాజ్య మహారాజు శ్రీకృష్ణదేవరాయలు పేరు మీదుగా “శ్రీకృష్ణదేవరాయ మార్గం”గా నామకరణం చేయాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా చారిత్రక వారసత్వాన్ని కూడా గుర్తుచేసే ప్రయత్నం జరుగుతోంది.
అదనంగా ఇతర ప్రధాన మార్గాలకు గరుడాద్రి, పద్మావతి, ఆళ్వార్లు వంటి పవిత్ర పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేర్లు భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలపరచనున్నాయి.
ఈ నామకరణ ప్రక్రియ పూర్తయిన తరువాత భక్తులకు మార్గాల గుర్తింపు సులభమవడంతో పాటు, ప్రతి ప్రదేశానికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపు లభించనుంది. తిరుమలలో భక్తుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు TTD వర్గాలు వెల్లడించాయి.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
