టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ నెంబర్ వన్ :సీఎం

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:

టెక్స్‌టైల్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టెక్స్‌టైల్స్ రంగ ప్రముఖులకు తెలంగాణ, హైదరాబాద్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలికారు. భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాల తయారీలో గొప్ప చరిత్ర ఉందని, శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్ రంగాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దాయని తెలిపారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్ రంగం భాగమైందని పేర్కొన్నారు.

నిజాం కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. టెక్స్‌టైల్స్ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాకుండా లక్షలాది కుటుంబాల జీవనాధారం అని సీఎం వివరించారు. చారిత్రక నేపథ్యం వల్లే ఈ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.

అదే విధంగా డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఎనర్జీ వంటి రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను మరోసారి స్పష్టం చేస్తూ, పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రస్తావిస్తూ, 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్‌గా ఎదుగుతోందని, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలు ఇక్కడ ప్రారంభం కావడం గర్వకారణమని పేర్కొన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా ఆకర్షితమవుతోందన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ టెక్స్‌టైల్స్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో తయారైన వస్త్రాలు వినియోగంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...