ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి):

తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సభలో ప్రజా ప్రతినిధులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినప్పటికీ, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, పలు శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న సేవల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లు ఆకర్షణీయంగా నిలిచి, మహిళలు మరియు బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతను తెలియజేశారు.

అనంతరం గర్భిణి స్త్రీలకు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా సీమంతం నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ సభలో ఆత్మ ఛైర్మన్ నారాయణ, ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎమ్మార్వో లక్షీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధుల గైర్హాజరు పై స్థానికంగా చర్చలు జరగగా, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని ప్రజలు కోరుతున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...