వంటగ్యాస్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కారణంగా వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేయకుండా నిర్ణీత గడువు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ ప్రభావంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై కూడా పడింది. చాలా చోట్ల వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే ఉన్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్ రూల్స్‌ను మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 35 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకోవాలి.

ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులు ప్రతి 45 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ నియమాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ వర్తిస్తాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.

నిర్దేశిత గడువుకు ముందే గ్యాస్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వినియోగదారులు పుకార్లను నమ్మకుండా, అవసరానికి అనుగుణంగా మాత్రమే గ్యాస్ వినియోగించాలని, నియమాలను పాటించాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి.

Latest articles

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

More like this

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...