వంటగ్యాస్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కారణంగా వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేయకుండా నిర్ణీత గడువు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ ప్రభావంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై కూడా పడింది. చాలా చోట్ల వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే ఉన్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్ రూల్స్‌ను మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 35 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకోవాలి.

ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులు ప్రతి 45 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ నియమాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ వర్తిస్తాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.

నిర్దేశిత గడువుకు ముందే గ్యాస్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వినియోగదారులు పుకార్లను నమ్మకుండా, అవసరానికి అనుగుణంగా మాత్రమే గ్యాస్ వినియోగించాలని, నియమాలను పాటించాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి.

Latest articles

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

ఘనంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సభ 

తలమడుగు, మన భారత్: తలమడుగు మండల కేంద్రంలో మండల స్థాయి ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సభను ఘనంగా...

More like this

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...