సైబర్ మోసాల బాధితులకు గుడ్ న్యూస్

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో బాధితులకు తాత్కాలిక ఉపశమనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన వారికి పరిమిత పరిహారం అందించే విధంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

ఈ పథకం ప్రకారం, రూ.50 వేల వరకు నష్టం చవిచూసిన బాధితులకు మాత్రమే పరిహారం వర్తిస్తుంది. బాధితుడు కోల్పోయిన మొత్తం సొమ్ములో గరిష్టంగా 85 శాతం లేదా రూ.25 వేల వరకు—ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని పరిహారంగా ఇవ్వనున్నారు. ఈ అవకాశం బాధితుడికి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది.

అయితే పరిహారం పొందాలంటే కొన్ని కీలక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబ్బులు కోల్పోయిన విషయం తెలిసిన 5 రోజులలోపు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయడం తప్పనిసరి. ఆలస్యమైతే పరిహారం అందకపోవచ్చు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ పరిహారంలో భాగంగా రూ.25 వేలలో సుమారు రూ.19,118ను ఆర్బీఐ భరిస్తుండగా, మిగతా రూ.2,941ను సంబంధిత బ్యాంకు భరిస్తుంది. థర్డ్ పార్టీ ఉల్లంఘనల కారణంగా జరిగే మోసాల దృష్ట్యా బాధితులకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.

పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, ఓటీపీ షేరింగ్ వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కొత్త నిర్ణయం సైబర్ మోసాల బాధితులకు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.

Latest articles

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

More like this

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...