సైబర్ మోసాల బాధితులకు గుడ్ న్యూస్
మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో బాధితులకు తాత్కాలిక ఉపశమనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన వారికి పరిమిత పరిహారం అందించే విధంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఈ పథకం ప్రకారం, రూ.50 వేల వరకు నష్టం చవిచూసిన బాధితులకు మాత్రమే పరిహారం వర్తిస్తుంది. బాధితుడు కోల్పోయిన మొత్తం సొమ్ములో గరిష్టంగా 85 శాతం లేదా రూ.25 వేల వరకు—ఈ రెండింటిలో...