కళ్యాణ లక్ష్మీతో పేదింటి బిడ్డకు ఆర్థిక భరోసా..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

పేద కుటుంబాల్లో కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేధికలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేద కుటుంబాలకు పెళ్లి ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు.

కుమార్తెల వివాహాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మీ పథకం పెద్దగా తోడ్పడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...