మన భారత్ ప్రతినిధి, Adilabad:
కేంద్ర పార్లమెంట్లో జరగనున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు Godam Nagesh హాజరుకానున్నారు. మార్చి 9, 2026 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు నిర్వహించనున్న ఈ సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
దేశ ఆర్థిక విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు, వివిధ శాఖల బడ్జెట్ కేటాయింపులపై చర్చలు జరిగే ఈ సమావేశాలు కీలకంగా భావించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులు, కేంద్ర నిధుల కేటాయింపుల అంశాలను ఎంపీ గోడం నగేష్ ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎంపీ గోడం నగేష్ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరనునట్లు సమాచారం. ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి అవసరమైన అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్కు సంబంధించిన బిల్లులు, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలపై పార్లమెంట్లో విస్తృతంగా చర్చలు జరగనున్నాయి.
