రైతులకు ఎల్లవేళలా అండగా బీఆర్‌ఎస్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

రైతులకు అండదండగా నిలిచే పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని బోథ్ శాసనసభ్యులు Anil Jadhav తెలిపారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో రూ.38 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు స్థానిక నాయకులు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, సాగునీటి సదుపాయాలు, రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే బీఆర్‌ఎస్ లక్ష్యమని, ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.

కల్వర్టు నిర్మాణంతో వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పనులు పూర్తయితే రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్లకు తరలించగలరని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్, బీఆర్‌ఎస్ నాయకులు, తలమడుగు మండల యాదవ సంఘం అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ యాదవ్, సంగర్తి నారాయణ, పులవైన జలంధర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ దూస అశోక్, నాయిని నవీన్, శ్రీపతి నగేష్, అంకం పోశెట్టి, ఆశన్న, నాయని భూమన్న, సాదుల రమేష్, బైండ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని నాయకులు తెలిపారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...