అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:

తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఉన్న ZPHS పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కిచెన్ షెడ్ , బాత్రూం నిర్మాణ పనులకు సర్పంచ్ పోరండ్ల సంతోష్ శ్రీకారం చుట్టారు. పాఠశాల మౌలిక వసతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

కిచెన్ షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షలు, అదనంగా మరొక పాఠశాలలో రూ.4 లక్షలతో విస్తరణ పనులు, అలాగే టాయిలెట్ నిర్మాణానికి రూ.2 లక్షలు కేటాయించగా మొత్తం రూ.10 లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహణ సులభ తరం కావడంతో పాటు, పరిశుభ్రత పరంగా కూడా మెరుగైన వాతావరణం కలగనుంది.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్, ఉప సర్పంచ్ మేకల శ్రీరాం, ZP హెడ్మాస్టర్ నర్సయ్య, రేగుల మోహన్, BRS నాయకులు పులవైనా జెలేందర్ యాదవ్, సంగర్తి నారాయణ, తలమడుగు యాదవ సంఘం అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ యాదవ్, నాయిని నవీన్, చింతల రాజన్న, పాశపు అజేయ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని స్వాగతించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరారు.

పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...