నెరడిగొండ టోల్ ప్లాజా వద్ద హరీష్ రావుకు ఘన స్వాగతం

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి, తన్నీరు హరీష్ రావు కు నెరడిగొండ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై హరీష్ రావును పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

జిల్లా పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్న హరీష్ రావు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. స్థానిక నాయకులతో సమావేశమై నియోజకవర్గ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నెరడిగొండ టోల్ ప్లాజా పరిసరాలు పార్టీ జెండాలతో కిక్కిరిసిపోయాయి. నాయకులు నినాదాలు చేస్తూ హర్షాతిరేక వాతావరణం సృష్టించారు. హరీష్ రావు జిల్లా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...