శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

Published on

-Advertisement-

మన భారత్,ఆంధ్రప్రదేశ్:

రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పరిధిలోని కార్యాలయాల్లో 4 ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. సంబంధిత పోస్టులను బట్టి పదో తరగతి, డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో రాత పరీక్ష మరియు వైవా వోస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.1000గా, SC, ST, PWBD అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం, పోస్టుల వివరాలు, అర్హతలు తదితర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా కోర్టుల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

వెబ్‌సైట్: srikakulam.dcourts.gov.in

ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...