ముంబై సాహిత్య సమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా కవులకు ఆహ్వానం

Published on

-Advertisement-

మన భారత్ , ముంబాయి: నవి ముంబై పణ్వేల్‌లో ఈనెల 18వ తేదీ ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక సాహిత్య సమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు మధు బావల్కర్, అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పెట్కులేలకు అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని కొంకన్ మరాఠీ సాహిత్య పరిషత్ పణ్వేల్ (ముంబై) మరియు పంచశీల తరుణ్ మండల్ సావర్గం సంస్థలు సంయుక్తంగా పంపినట్లు తెలిపారు.

ఈ సాహితీ సమ్మేళనంలో పాల్గొనడానికి శనివారం మధ్యాహ్నం నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి బయలుదేరి వెళ్లనున్నట్లు సుకుమార్ పెట్కులే వెల్లడించారు. తెలంగాణలో బహుజన సాహిత్యాన్ని కేంద్రంగా చేసుకొని హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో కవితలు, అనువాద రచనలు చేస్తూ విశేష గుర్తింపు పొందిన సుకుమార్ పెట్కులేను, బహుభాషా కవిగా పేరుగాంచిన మధు బావల్కర్‌ను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమ నిర్వాహకులు, ప్రముఖ సాహితీవేత్త నాగనాథ్ డోలారే (పణ్వేల్, ముంబై) మాట్లాడుతూ, ఈ సందర్భంగా తన రచనలైన మరాఠీ భాషలోని రెండు కవితా సంపుటి పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించనుండగా, ఇందులో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొననున్నారు.

ఈ సాహితీ సమ్మేళనం భాషా సాహిత్యాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరచే వేదికగా నిలవనుందని సాహిత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest articles

మతసామరస్యానికి ప్రతీకగా పీర్ల పండుగ

రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మతసామరస్యానికి ప్రతీకగా రుయ్యాడి పీర్ల పండుగ: ఎమ్మెల్యే...

ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత:...

బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్,...

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు...

More like this

మతసామరస్యానికి ప్రతీకగా పీర్ల పండుగ

రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మతసామరస్యానికి ప్రతీకగా రుయ్యాడి పీర్ల పండుగ: ఎమ్మెల్యే...

ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత:...

బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్,...