ముంబై సాహిత్య సమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా కవులకు ఆహ్వానం

Published on

-Advertisement-

మన భారత్ , ముంబాయి: నవి ముంబై పణ్వేల్‌లో ఈనెల 18వ తేదీ ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక సాహిత్య సమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు మధు బావల్కర్, అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పెట్కులేలకు అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని కొంకన్ మరాఠీ సాహిత్య పరిషత్ పణ్వేల్ (ముంబై) మరియు పంచశీల తరుణ్ మండల్ సావర్గం సంస్థలు సంయుక్తంగా పంపినట్లు తెలిపారు.

ఈ సాహితీ సమ్మేళనంలో పాల్గొనడానికి శనివారం మధ్యాహ్నం నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి బయలుదేరి వెళ్లనున్నట్లు సుకుమార్ పెట్కులే వెల్లడించారు. తెలంగాణలో బహుజన సాహిత్యాన్ని కేంద్రంగా చేసుకొని హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో కవితలు, అనువాద రచనలు చేస్తూ విశేష గుర్తింపు పొందిన సుకుమార్ పెట్కులేను, బహుభాషా కవిగా పేరుగాంచిన మధు బావల్కర్‌ను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమ నిర్వాహకులు, ప్రముఖ సాహితీవేత్త నాగనాథ్ డోలారే (పణ్వేల్, ముంబై) మాట్లాడుతూ, ఈ సందర్భంగా తన రచనలైన మరాఠీ భాషలోని రెండు కవితా సంపుటి పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించనుండగా, ఇందులో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొననున్నారు.

ఈ సాహితీ సమ్మేళనం భాషా సాహిత్యాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరచే వేదికగా నిలవనుందని సాహిత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...