సంక్రాంతి రద్దీకి స్పెషల్ బస్సులు.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి

Published on

-Advertisement-

సంక్రాంతి రద్దీకి స్పెషల్ బస్సులు.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి

మన భారత్, తెలంగాణ: 

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రకటించింది. 2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) ప్రకారం టికెట్ ధరపై గరిష్టంగా 1.5 రెట్లు వరకు ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ నిర్ణయం మేరకు ప్రస్తుతం రూ.100గా ఉన్న టికెట్ ధర రూ.150కు పెరగనుంది. అయితే ఈ పెంపు సాధారణ బస్సులకు కాకుండా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ముందస్తు ప్రయాణ రద్దీ దృష్ట్యా, అలాగే తిరుగు ప్రయాణాలు అధికంగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే పెరిగిన ఛార్జీలు అమల్లో ఉంటాయని టీజీఎస్‌ఆర్టీసీ వివరించింది. ప్రయాణికులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని, ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, భద్రతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...