కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే..

Published on

-Advertisement-

కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ గారు అందించిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన సంవత్సర వేడుకలను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకున్నారు.

Latest articles

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం...

More like this

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...