మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ..

Published on

-Advertisement-

నూతన సంకల్పంతో 2026లోకి అడుగులు..

మన భారత్, న్యూఢిల్లీ:

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నూతన సంకల్పంతో 2026 సంవత్సరంలోకి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గడిచిన సంవత్సరం భారత్‌కు అనేక ఘన విజయాలు అందించిన సంవత్సరమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరావడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అదే విధంగా, అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు, ముఖ్యంగా శుభాంశు శుక్లా వంటి యువ ప్రతిభావంతుల కృషి దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పెంచిందని ప్రశంసించారు.

యువశక్తే భారతదేశానికి ప్రధాన బలం అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న సరికొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలను యువత అందిపుచ్చుకుని, దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. విజ్ఞానం, నైపుణ్యం, ఆవిష్కరణలతో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దే బాధ్యత యువతపై ఉందని అన్నారు.

దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, సమిష్టి కృషితోనే స్వావలంబన భారత లక్ష్యాన్ని సాధించగలమని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం దేశానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

Latest articles

ఆ మంత్రికి అనారోగ్యం.. యథావిధిగా సమావేశం

మన భారత్, తెలంగాణ :  ఉట్నూరు సమీక్షకు జూపల్లి, అడ్లూరి గైర్హాజరు.. కలెక్టర్లతో సమావేశం యథావిధిగా మన భారత్, ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్...

వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన భారత్, హైదరాబాద్: ఈ ఏడాది ఎల్‌నినో...

వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్

108 అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ లేదండి.. వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మన భారత్, ఆదిలాబాద్:...

డ్రైనేజీ సమస్య పట్టించుకోరా.!

మన భారత్ | తలమడుగు కొత్తూరులో డ్రైనేజీ సమస్య తీవ్రం.. కొత్త నాళాలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ తలమడుగు, జూలై 19:...

More like this

ఆ మంత్రికి అనారోగ్యం.. యథావిధిగా సమావేశం

మన భారత్, తెలంగాణ :  ఉట్నూరు సమీక్షకు జూపల్లి, అడ్లూరి గైర్హాజరు.. కలెక్టర్లతో సమావేశం యథావిధిగా మన భారత్, ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్...

వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన భారత్, హైదరాబాద్: ఈ ఏడాది ఎల్‌నినో...

వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్

108 అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ లేదండి.. వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మన భారత్, ఆదిలాబాద్:...