నూతన సంకల్పంతో 2026లోకి అడుగులు..
మన భారత్, న్యూఢిల్లీ:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నూతన సంకల్పంతో 2026 సంవత్సరంలోకి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గడిచిన సంవత్సరం భారత్కు అనేక ఘన విజయాలు అందించిన సంవత్సరమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరావడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. అదే విధంగా, అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలు, ముఖ్యంగా శుభాంశు శుక్లా వంటి యువ ప్రతిభావంతుల కృషి దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పెంచిందని ప్రశంసించారు.
యువశక్తే భారతదేశానికి ప్రధాన బలం అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న సరికొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలను యువత అందిపుచ్చుకుని, దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. విజ్ఞానం, నైపుణ్యం, ఆవిష్కరణలతో భారత్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దే బాధ్యత యువతపై ఉందని అన్నారు.
దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, సమిష్టి కృషితోనే స్వావలంబన భారత లక్ష్యాన్ని సాధించగలమని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం దేశానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
