మూడు నెలలుగా వేతనాలు లేవు..

Published on

-Advertisement-

మూడు నెలలుగా వేతనాలు లేవు… ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్‌లకు తీవ్ర ఇబ్బందులు

మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ సైతం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణం శుభ్రపరిచే బాధ్యతను నిర్వర్తిస్తున్న వీరు దైనందిన ఖర్చులకూ డబ్బుల్లేక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

ఈ నేపథ్యంలో స్కావెంజర్‌ల సమస్యలను యూనియన్ నేతలు వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు దర్శనాల ప్రతాప్ మాట్లాడుతూ, “మూడునెలలుగా వేతనాలు విడుదల చేయకపోవడం అన్యాయం. కుటుంబాలను నడపడానికి కూడా వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రత కోసం కష్టపడే సిబ్బందికి తక్షణమే వేతనాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

స్కావెంజర్‌ల సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని, ఇకపై ఇలాంటి ఆలస్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు కోరుతున్నారు.

Latest articles

గ్రామస్థాయిలో సేవలందించే సైనికులే అంగన్వాడీలు..

మన భారత్, మొగుళ్ళపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్...

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన...

నాణ్యత లేని సీసీ రోడ్డు.. పగుళ్లతో బయటపడిన నిర్లక్ష్యం

మన భారత్, ఆదిలాబాద్: మండలంలోని పొన్నారి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై వెంటనే స్పందించాలి

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు చేపట్టిన సమ్మెపై TSDF తీవ్రంగా స్పందించింది....

More like this

గ్రామస్థాయిలో సేవలందించే సైనికులే అంగన్వాడీలు..

మన భారత్, మొగుళ్ళపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్...

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన...

నాణ్యత లేని సీసీ రోడ్డు.. పగుళ్లతో బయటపడిన నిర్లక్ష్యం

మన భారత్, ఆదిలాబాద్: మండలంలోని పొన్నారి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...