రేపు భారీ ప్రకటన చేస్తా.. నారా లోకేష్

Published on

-Advertisement-

రేపు భారీ ప్రకటన: ఏపీకి మరో మెగా ఇన్వెస్ట్‌మెంట్ రాబోతోందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు భారీ పెట్టుబడి ప్రకటన చేయనున్నట్లు ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు.

2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసింది. కానీ ఇప్పుడు తుఫాను మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోంది. రేపు ఉదయం 9 గంటలకు పెద్ద అనౌన్స్‌మెంట్ ఉంటుంది. రెడీగా ఉండండి’ అంటూ లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి అనుకూల వాతావరణం నెలకొన్నందున పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీపై దృష్టి సారిస్తున్నాయని ఆయన తెలిపారు.

ఇక ఢిల్లీలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేశ్,
ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోంది. ఒకటి కేంద్రం, మరొకటి రాష్ట్రం. అందుకే ఇన్వెస్టర్లు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక విధానాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, ప్రోత్సాహక ప్యాకేజీలతో ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు వెలువడబోయే ప్రకటనపై పరిశ్రమల వర్గాలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Latest articles

ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్ రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు...

అంగన్‌వాడీ టీచర్లకు 5G ఫోన్ల పంపిణీ..

మన భారత్, ఆదిలాబాద్ : నెరడిగొండ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్‌వాడీ సిబ్బందికి 5G మొబైల్ ఫోన్ల...

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు...

ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలి..

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తాంసీ మండల కేంద్రంలో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలకు...

More like this

ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్ రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు...

అంగన్‌వాడీ టీచర్లకు 5G ఫోన్ల పంపిణీ..

మన భారత్, ఆదిలాబాద్ : నెరడిగొండ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్‌వాడీ సిబ్బందికి 5G మొబైల్ ఫోన్ల...

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు...