జాగృతి జనం బాటలో కవిత..

Published on

-Advertisement-

ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన రెండవ రోజు సందడి!

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 4:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో “జాగృతి జనం బాట” కార్యక్రమాన్ని రెండవ రోజూ ఉత్సాహంగా కొనసాగిస్తారని జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా కలవాలని లక్ష్యంగా ఆమె పర్యటనలో పలు కీలక సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.

ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని తనిష్క్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 9:30 గంటలకు హోటల్ సాయి పంచవటిలో జిల్లా మేధావులు, విద్యావంతులతో ఆమె ప్రత్యేకంగా చర్చించనున్నారు. సమాజ అభివృద్ధి, యువత పాత్ర, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 12 గంటలకు ద్వారకా నగర్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ దామోదర్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరగనుంది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన ఉద్యమ వీరులను కవిత కలుసుకోనున్నారు.

తదుపరి 2 గంటలకు ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని (కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం) సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 3 గంటలకు ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం 3:30 గంటలకు ఐటీడీఏ, ఉట్నూర్లో ఆదివాసీ మహిళల వర్క్‌షాప్‌ను పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా జాగృతి నాయకుడు రంగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ “జాగృతి జనం బాటలో కవిత  పర్యటన ప్రజల్లో విస్తృత స్పందన కలిగిస్తోంది. ప్రతి గ్రామంలో ఆమెకు ఉత్సాహపూరిత స్వాగతం లభిస్తోంది,” అని తెలిపారు.

Latest articles

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్:  ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల...

More like this

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...