సేంద్రియ పద్ధతుల్లోనే భవిష్యత్తు భద్రత -కలెక్టర్ పి. ప్రావీణ్య

Published on

-Advertisement-

ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతపై బిడెకన్నెలో అవగాహన. కృషి సఖి శిక్షణా కార్యక్రమం ముగింపు

మన భారత్, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం : సేంద్రియ వ్యవసాయం, ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య రైతులకు, మహిళలకు పిలుపునిచ్చారు. ఝరాసంగం మండలంలోని బిడెకన్నె గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ మరియు లీడ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషి సఖి శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది.

ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా హాజరైన కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ..“భవిష్యత్తు తరాలకు భద్రత కల్పించాలంటే సేంద్రియ పద్ధతిలో పంటల సాగు తప్పనిసరి. పర్యావరణానికి అనుకూలంగా, మన ఆరోగ్యానికి మేలు చేసే పంటల వైపు రైతులు మళ్లాలి. మన తాతల కాలంలో సాగు చేసిన ప్రాచీన పంటలు ఇప్పుడు మరుగున పడిపోతున్నాయి. ఆ సంప్రదాయ పంటలను పునరుద్ధరించేందుకు మహిళలు ముందుండాలి” అని సూచించారు.

సహజ వ్యవసాయం ద్వారా నేలలో జీవసత్వం పెరుగుతుందని, నీటి వినియోగం తగ్గుతుందని, రైతులకు దీర్ఘకాల లాభాలు చేకూరుతాయని వివరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన కృషి సఖి మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, కృషి సఖి మహిళలు, అరణ్య సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...