సేంద్రియ పద్ధతుల్లోనే భవిష్యత్తు భద్రత -కలెక్టర్ పి. ప్రావీణ్య

Published on

-Advertisement-

ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతపై బిడెకన్నెలో అవగాహన. కృషి సఖి శిక్షణా కార్యక్రమం ముగింపు

మన భారత్, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం : సేంద్రియ వ్యవసాయం, ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య రైతులకు, మహిళలకు పిలుపునిచ్చారు. ఝరాసంగం మండలంలోని బిడెకన్నె గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ మరియు లీడ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషి సఖి శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది.

ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా హాజరైన కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ..“భవిష్యత్తు తరాలకు భద్రత కల్పించాలంటే సేంద్రియ పద్ధతిలో పంటల సాగు తప్పనిసరి. పర్యావరణానికి అనుకూలంగా, మన ఆరోగ్యానికి మేలు చేసే పంటల వైపు రైతులు మళ్లాలి. మన తాతల కాలంలో సాగు చేసిన ప్రాచీన పంటలు ఇప్పుడు మరుగున పడిపోతున్నాయి. ఆ సంప్రదాయ పంటలను పునరుద్ధరించేందుకు మహిళలు ముందుండాలి” అని సూచించారు.

సహజ వ్యవసాయం ద్వారా నేలలో జీవసత్వం పెరుగుతుందని, నీటి వినియోగం తగ్గుతుందని, రైతులకు దీర్ఘకాల లాభాలు చేకూరుతాయని వివరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన కృషి సఖి మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, కృషి సఖి మహిళలు, అరణ్య సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...