లంబాడా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలి

Published on

-Advertisement-

లంబాడా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ గిరిజన విద్యార్థి సంఘం ఆగ్రహం

మన భారత్, నిజామాబాద్ :
తాజా మంత్రివర్గ విస్తరణలో లంబాడా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని గిరిజన విద్యార్థి సంఘం మండిపడింది. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి లంబాడా ఓట్లు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. అయితే, ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు చర్య అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం గిరిజన వర్గాల మధ్య విభజన సృష్టించే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, మాజీ ఎంపీలు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకుని లంబాడా సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సామాజిక న్యాయం సూత్రాన్ని పాటించి, లంబాడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో తగిన స్థానం ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం కోరింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ప్రారంభించనున్నట్లు హెచ్చరించింది.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోర్ర బన్నీ నాయక్, ఇతర గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...