ప్రజలకు అందుబాటులో సేవలు

Published on

-Advertisement-

మన భారత్, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మరింత అందుబాటులో ఉండి, వేగవంతమైన సేవలు అందించాలని ఆర్టీవో రమాదేవి సూచించారు. బుధవారం ఆమె రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, “ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ పరిపాలనలో ప్రధాన భాగం. అందుకే ప్రతి దరఖాస్తును సమయానికి పరిష్కరించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి” అని సూచించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు. “ఎన్నికల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించేలా ముందుగానే సన్నాహాలు చేయాలి” అని ఆర్టీవో రమాదేవి తెలిపారు. విధులకు గైర్హాజరు కాకుండా సమయ పాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రజనీకుమారి పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.

Latest articles

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

More like this

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...