కురుమూర్తి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీహరి

Published on

-Advertisement-

శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి అలంకరణ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి

మన భారత్, వనపర్తి:  ప్రఖ్యాత శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో అలంకరణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఆలయ ఆచారాల ప్రకారం స్వామి వారికి పట్టు వస్త్రాలను మంత్రి సమర్పించారు. అమరచింత మండల కేంద్రం నుండి లాంచనంగా పట్టు వస్త్రాలను ఆలయ కమిటీకి మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. అనంతరం ఆత్మకూరు మండలంలోని ఎస్బీఐ బ్యాంకులో భద్రపరిచిన స్వామి వారి ఆభరణాలను స్వీకరించి, ఆత్మకూరు పట్టణం నుండి భక్తుల ఊరేగింపుగా అమ్మాపూర్ గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడ ఆభరణాలను ఆలయ దొరకు అధికారికంగా అందజేశారు.స్వామి వారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో భక్తి పరవశంగా అలంకరించనున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఉత్సవాల్లో పాల్గొనడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అరవింద్ రెడ్డి, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.

 

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...