జనగామలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published on

-Advertisement-

రైతులు కనీస మద్దతు ధరకు పత్తిని విక్రయించాలని కలెక్టర్ సూచన

మన భారత్, జనగామ: జనగామ జిల్లా ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలో సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ప్రారంభించారు. రైతుల ప్రయోజనార్థం ఈ కేంద్రం ద్వారా పత్తిని కనీస మద్దతు ధర (MSP) కే కొనుగోలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “రైతులు మధ్యవర్తుల జోలికి పోకుండా నేరుగా సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయిస్తే నష్టాలు తప్పి, సరైన లాభాలు పొందవచ్చు. పత్తి నాణ్యతను కాపాడుకుంటూ తేమ శాతం తగ్గిన తరువాతే మార్కెటుకు తేవాలని” సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పత్తి మార్కెట్లలో పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే అధికారులు స్పందిస్తారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, అధికారులు, రైతు నాయకులు, సీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్ పత్తి సెంటర్‌ లో ఏర్పాట్లు, బరువుల కొలత పరికరాలు, నిల్వ సదుపాయాలను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Latest articles

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....

కాలి బుడిదైన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

మన భారత్ ,మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేష్ పల్లి, పెద్దకొమటి...

More like this

తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటలు

మన భారత్ ,తిరుమల:  ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతం సందర్భంగా ఆలయానికి...

పెళ్లి పేరుతో మోసం… రూ. 9.35 కోట్లు లూటీ

మన భారత్ ,హైదరాబాద్:  పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై...

బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

మన భారత్ , జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది....