మన భారత్ ,హైదరాబాద్:
పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేసినట్లు ఓ నటి పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్లో సంచలనం రేపుతోంది.
లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర 2018లో భారత్కు వచ్చిన సమయంలో నటి అనూష రెడ్డి పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ధర్మేంద్రను వివాహం పేరుతో నమ్మించి, విడతల వారీగా మొత్తం రూ. 9.35 కోట్లు తీసుకున్నట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అనంతరం వివాహంపై మాట తప్పి, సంబంధాన్ని తెంచుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో మోసపోయినట్లు భావించిన ధర్మేంద్ర కుటుంబం న్యాయం కోసం ముందుకొచ్చింది.
ఈ మేరకు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ (Central Crime Station) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు లావాదేవీలు, సంబంధిత ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. వివాహం పేరుతో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలని హెచ్చరిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
