బీపీ మాత్రలు మింగి బాలిక ఆత్మహత్యాయత్నం..

Published on

-Advertisement-

మన భారత్ , జైనథ్:

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తండ్రి మందలించాడనే మనస్తాపంతో 17 ఏళ్ల బాలిక అధిక మోతాదులో బీపీ మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురైంది.

స్థానికుల వివరాల ప్రకారం, ఆదివారం మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమంగా మారుతుండటంతో వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది కార్తీక్ సింగ్, విట్టల్ గౌడ్ తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని బాలికకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషయంలో వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. చిన్న విషయాలకే యువత తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరమని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పిల్లలతో సానుకూలంగా మెలగాలని, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని మార్గనిర్దేశం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

More like this

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...