ఫుడ్ సెక్యూరిటీ డిజిటల్ కార్డుల పంపిణీ..

Published on

-Advertisement-

ఫుడ్ సెక్యూరిటీ డిజిటల్ కార్డులతో సంక్షేమ పథకాల ప్రయోజనాలు: కౌన్సిలర్ నాగసేన్ మాన్కర్

ఆదిలాబాద్:మన భారత్ ,ఆగస్టు23, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు నంబర్‌ 8 కేఆర్‌కే కాలనీ కౌన్సిలర్ నాగసేన్ మాన్కర్ కోరారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఫుడ్ సెక్యూరిటీ డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగసేన్ మాన్కర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ కార్డులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఏ కుటుంబం కూడా ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని, ఫుడ్ సెక్యూరిటీ డిజిటల్ కార్డులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన వివరాలు, ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు. కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రజలు సరైన వివరాలను అందించాలని, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కౌన్సిలర్ కోరారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందేలా తన వంతు సహకారం అందిస్తానని నాగసేన్ మాన్కర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, కేఆర్‌కే కాలనీకి చెందిన స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి..

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దు: బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు...

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

రాంనగర్‌లో 10, 11వార్డుల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆదిలాబాద్: మన భారత్, ఆగస్టు,23 ఆదిలాబాద్ రాంనగర్ ప్రాంతంలో 10వ,...

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌడాల సంతోష్

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంతోష్ తాంసి:మన భారత్, ఆగస్టు 23, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ...

జాజాపూర్‌లో ఈక్వి-ల్యాబ్ ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతం

మన భారత్, జాజాపూర్, ఆగస్టు 21: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా విధానం, సమస్యలను గుర్తించి పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించేందుకు...

More like this

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి..

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దు: బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు...

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

రాంనగర్‌లో 10, 11వార్డుల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఆదిలాబాద్: మన భారత్, ఆగస్టు,23 ఆదిలాబాద్ రాంనగర్ ప్రాంతంలో 10వ,...

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌడాల సంతోష్

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంతోష్ తాంసి:మన భారత్, ఆగస్టు 23, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ...