బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..!

Published on

-Advertisement-

మహా తుఫానుగా మారుతోందా?

ఈ ప్రాంతాలు అలర్ట్

మన భారత్, న్యూస్ డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడన్ గా మారిపోయింది. వాయువ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా.. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాను వచ్చే అవకాశాలు కూడా ప్రస్తావించింది. ఈ ప్రభావంతో తూర్పు, మధ్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం పూర్తిగా కూల్ అయింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారి పెద్ద ఎత్తున అలలు ఏవిసిపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన జాతరలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాయువ్య బంగాళాఖాతం నుంచి విస్తరించిన రుతుపవన ద్రోని కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులిటెన్ విడుదల చేసింది.

ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్, భద్రాది కొత్తగూడెం, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఖరీఫ్ సాగులో ఉన్న రైతులకు ఈ చినుకుల ఎంతో ఊరటానివ్వనున్నాయి. ఉరుములు,మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

చెట్ల కింద,పాతబడిన భవనాలు, కరెంటు స్తంభాలు,హోర్డింగుల కింద నిలబడకూడదు.

పడుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచటం మంచిది.

ప్రస్తుతం అత్యంత భారీ వర్షాలు హెచ్చరికలు లేకపోయినా, ఈదురు గాలులు వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్ 

మీ రాష్ట్రంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...