ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది

Published on

-Advertisement-

SIR ఎమ్యునరేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి – బోథ్‌లో పరిశీలించిన కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్

మన భారత్ | బోథ్ | జూలై 2, 2026

ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా SIR (Special Intensive Revision) ఎమ్యునరేషన్ ప్రక్రియను నిర్వహించాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు.

గురువారం బోథ్ పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న SIR ఎమ్యునరేషన్ ప్రక్రియను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్యునరేషన్ పనుల పురోగతిని తెలుసుకుని, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు కావడంతో ఎవరూ ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న BLOలు మరియు BLA-2లకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అవసరమైన ధ్రువపత్రాలు, వివరాలను సమయానికి అందించి ఎమ్యునరేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా భాగస్వామ్యం కావాలని ఆడే గజేందర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, బోథ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు భోజన్న, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ దాస్, మాజీ ఎంపీటీసీ చాట్ల ఉమేష్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రాజు రెడ్డి, మాజీ డైరెక్టర్ అబ్రార్, ఆత్మ డైరెక్టర్లు అబుద్, రహీమొద్దీన్, కుచ్లాపూర్ ఉపసర్పంచ్ అరుణ్ రెడ్డి, సీనియర్ నాయకులు మొహమ్మద్, హసీబ్, మాజీ రాష్ట్ర కన్వీనర్ అనుపట్ల సంజీవ్, అచ్యుతానంద రెడ్డి, బీరం రవి, గడ్డల నారాయణ, భీమా భూచన్న, మాజీ అధికార ప్రతినిధి యండి సద్దాం, జగన్, షేక్ షకీర్,మారుతి తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం...

More like this

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...