ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం..

Published on

-Advertisement-

కుచులపూర్‌లో తీరిన తాగునీటి సమస్య..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో నాలుగు బోర్ల ఏర్పాటు

నీటి వసతి కల్పించిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల కృతజ్ఞతలు..

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులపూర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న నీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవ తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టారు.

గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కుచులపూర్‌లో నాలుగు (04) బోర్లను ఏర్పాటు చేయించి నీటి సరఫరాకు మార్గం సుగమం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోడెపు వెంకన్న మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాల్లో తాగునీరు ముఖ్యమైనదని, గ్రామ సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

నీటి వసతి మెరుగుపడటంతో సంతోషించిన గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest articles

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం...

More like this

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...