నిండు జీవితానికి-రెండు చుక్కలు

Published on

-Advertisement-

పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలి

అంకుషాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి

మన భారత్,మొగుళ్ళపల్లి:

ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం పోలియో నిర్మూలనలో భాగంగా చేపట్టిన “నిండు జీవితానికి-రెండు చుక్కలు” అనే పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుషాపురం గ్రామంలో సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులు పాల్గొని గ్రామంలోని 0-5 సంవత్సరాల వయసు లోపు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తల్లిదండ్రులు 0-5 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. చిన్నారుల ఆరోగ్యం ప్రతి కుటుంబానికి అమూల్యమైన సంపద అని పేర్కొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, “రెండు చుక్కలు-జీవితాంతం రక్షణ” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేర్చాలన్నారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని..చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించి..ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కృషి చేసిన ప్రజలకు ఆమె అభినందించారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...