అగ్రకులాల ఆధిపత్యమేనా..?

Published on

-Advertisement-

ఫీజు రీయంబర్స్మెంట్ రద్దుకు కుట్ర

పాత్రికేయుల సమావేశంలో వేముల మహేందర్ గౌడ్ వెల్లడి

మన భారత్,మొగుళ్ళపల్లి:

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినప్పటికీ, వచ్చిన తెలంగాణలో పిడికెడు శాతం లేని అగ్రకులాలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 24 మంది ఉంటే..తెలంగాణ రాష్ట్రం వచ్చాక 19 మంది అయ్యారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుగురు బీసీ మంత్రులు ఉంటే..ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని తెలిపారు. 2008లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేశారని, తెలంగాణ వచ్చాక పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ సంక్షేమ సంఘం తిరుగులేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...