అగ్రకులాల ఆధిపత్యమేనా..?

Published on

-Advertisement-

ఫీజు రీయంబర్స్మెంట్ రద్దుకు కుట్ర

పాత్రికేయుల సమావేశంలో వేముల మహేందర్ గౌడ్ వెల్లడి

మన భారత్,మొగుళ్ళపల్లి:

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినప్పటికీ, వచ్చిన తెలంగాణలో పిడికెడు శాతం లేని అగ్రకులాలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 24 మంది ఉంటే..తెలంగాణ రాష్ట్రం వచ్చాక 19 మంది అయ్యారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుగురు బీసీ మంత్రులు ఉంటే..ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని తెలిపారు. 2008లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేశారని, తెలంగాణ వచ్చాక పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ సంక్షేమ సంఘం తిరుగులేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...