అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్

ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం – 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 54 మద్యం బాటిళ్లు స్వాధీనం

ఆదిలాబాద్, జూన్ 3 (మన భారత్):
ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు సహకారం అందించే లక్ష్యంతో ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, అలాగే 54 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నంబర్ ప్లేట్లు లేని 6 వాహనాలు గుర్తించగా, ఇద్దరు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఎస్పీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. గంజాయి వ్యసనానికి బానిస అయితే వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు కుటుంబం, సమాజం కూడా నష్టపోతుందని పేర్కొన్నారు. పోలీసు జాగిలం “రూమా” సహాయంతో గంజాయి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

సైబర్ నేరాలపై కూడా ఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు.

నేర నియంత్రణలో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, ప్రతి కాలనీ, వీధి, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సీసీటీవీలు నేరాల నివారణలోనే కాకుండా నేరస్థులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐలు కె. నాగరాజు, రహీం పాషా, కె. ఫణిధర్, ఎస్సైలు విష్ణువర్ధన్, దేవేందర్, పోలీసు జాగిలం రూమా, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.

Latest articles

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం...

నేడు చేప ప్రసాదం పంపిణీ..

ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు,...

బహుజన త్యాగాలు..అగ్రకులాల భోగాలా.?

బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీసీ,...

వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ

టెట్ పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016 అమలు చేయాలని జిల్లా...

More like this

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం...

నేడు చేప ప్రసాదం పంపిణీ..

ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు,...

బహుజన త్యాగాలు..అగ్రకులాల భోగాలా.?

బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీసీ,...