రైతులకు న్యాయం జరగకపోతే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్యే

Published on

-Advertisement-

మన భారత్ | భీంపూర్

జొన్న రైతులతో కలిసి భోజనం.. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో జొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన జొన్నలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లోడింగ్ పనుల్లో జాప్యం, గన్నీ సంచుల కొరత, తడిసిన జొన్నల కొనుగోలుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలను రైతులు ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి పండించిన జొన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోవడం, లోడింగ్ ఆలస్యం కారణంగా అకాల వర్షాలకు తడవడం బాధాకరమని అన్నారు. రైతుల శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుల కల్లాల వద్దే కాంటాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన జొన్నలను కూడా కొనుగోలు చేయాలని కోరారు.

రైతుల పంటకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన, కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ సమస్యలు, గన్నీ సంచుల కొరత వంటి అంశాలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే రైతులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించిన ఎమ్మెల్యే, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ ఇస్తారి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుధాకర్, సీనియర్ నాయకులు కేమ శ్రీకాంత్, మండల కన్వీనర్ నాగయ్య, సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ లింబాజీ, ప్రవీణ్, గోవర్ధన్, కపిల్, రాథోడ్ ఉత్తమ్, దినేష్, అనిల్, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

-గొంటిముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰

Latest articles

ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం

మన భారత్ | తలమడుగు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వందలాది మందికి కంటి వైద్య సేవలు ఆదిలాబాద్ జిల్లా...

ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం..

మన భారత్ | తలమడుగు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా...

ఎమ్మెల్యేకు కష్టాలు చెప్పి కంటతడి పెట్టిన రైతు..

మన భారత్ | తాంసి జొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. కొనుగోలు కేంద్రంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లా...

మహిళలకు అవగాహన.. యువతకు క్రమశిక్షణ అవసరం: గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ

మన భారత్ | గంట్యాడ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న మహిళలతో సమావేశం.. శక్తి యాప్‌పై అవగాహన విజయనగరం జిల్లా గంట్యాడ...

More like this

ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం

మన భారత్ | తలమడుగు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వందలాది మందికి కంటి వైద్య సేవలు ఆదిలాబాద్ జిల్లా...

ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం..

మన భారత్ | తలమడుగు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా...

ఎమ్మెల్యేకు కష్టాలు చెప్పి కంటతడి పెట్టిన రైతు..

మన భారత్ | తాంసి జొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. కొనుగోలు కేంద్రంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లా...