బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీకి ఘన సన్మానం

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:
ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, జిల్లా కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్‌లకు తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో ఘన సన్మానం నిర్వహించారు. గ్రామస్థులు, బీసీ సంఘ నాయకులు కలిసి శాలువాలు కప్పి పూలమాలలతో వారిని అభినందించారు.

అలాగే ఇటీవల బీపీ మండల్ అవార్డు అందుకున్న తలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షుడు రవికాంత్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని గ్రామ పెద్దలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల సాధన, వెనకబడిన బీసీ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం సంఘం మరింత ముందుండి పోరాడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నాయకులు కృషి చేయాలని సూచించారు.

బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ బీసీల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీసీల ఐక్యత కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్, జిల్లా నాయకులు తిరుమనగిరి ప్రశాంత్, ఉపసర్పంచ్ శ్రీరాములు, గ్రామ బీసీ సంఘం అధ్యక్షుడు నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతాజీ, కిరణ్ యాదవ్ సంఘం మండల అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ యాదవ్, గొల్లని మోహన్, ఆడేపు శ్రీనివాస్, రేగుల మోహన్, రమేష్, అశోక్, నగేష్, విష్ణు, సురేష్, రవి, శ్రీరామ్, రమేష్, సంతోష్ వెంకట్‌తో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...