అక్రమ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:
రాత్రి వేళల్లో గ్రామాల్లోకి వచ్చి లూజ్ విత్తనాలు విక్రయించే వ్యక్తులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అనుమానాస్పదంగా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని, ఎవరైనా అక్రమ విక్రయాలకు పాల్పడితే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రత్యేకంగా నిషేధిత బీటీ-3 విత్తనాలు మరియు 3 గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు సరైన ధృవీకరణ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, లైసెన్స్ లేని వ్యక్తుల వద్ద కొనుగోలు చేయడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రైతుల రక్షణ కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా సందేహాలు, ఇబ్బందులు ఎదురైన సందర్భంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) కంట్రోల్ రూమ్ నంబర్ 89777428542 ను సంప్రదించాలని సూచించారు.

రైతులు జాగ్రత్తగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...