గిరిజన బాలికల అద్భుత ప్రతిభ..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు :

తలమడుగు మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఎం. అరుణ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ, గిరిజన బాలికలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన, సాంకేతిక విద్యను అందుకుంటూ అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. మొత్తం 57 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఇందులో ముఖ్యంగా 10 మంది విద్యార్థినులు 500కి పైగా మార్కులు సాధించడం పాఠశాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

టాప్ మార్కులు సాధించిన విద్యార్థినుల్లో డి. శృతి 521 మార్కులతో ముందంజలో నిలవగా, కె. నెరజాల, కె. సుమిత్ర తలో 513 మార్కులు, ఎం. వైష్ణవి 512, డి. సుప్రజ 509, జి. పల్లవి 508, ఎం. ధనలక్ష్మి 505, ఎస్. కళ్యాణి 504, ఎం. లతా 503, ఏ. శివాని 502 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.

విద్యార్థినుల విజయంపై హెడ్‌మాస్టర్ ఎం. అరుణతో పాటు హాస్టల్ వార్డెన్ ఈ. రామన్ అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, విద్యార్థినుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

ఈ ఫలితాలతో తలమడుగు మండలానికి మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థినులపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...