క్షణాల్లో టెన్త్ ఫలితాలు.. ఇక్కడ క్లిక్ చేయండి

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ (SCERT) భవనం ఆవరణలో ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొని ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారిక సమాచారం. పరీక్షలు ప్రశాంతంగా ముగియగా, విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా

ఈ వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి మార్కుల వివరాలు పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.

వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు…

ఈసారి విద్యార్థుల సౌలభ్యం కోసం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులోకి తెచ్చారు. అధికారిక మీసేవా వాట్సాప్ నంబర్ 80969 58096కు “Hi” అని మెసేజ్ పంపి, తరువాత “SSC Result” అని టైప్ చేయాలి. అనంతరం “Open Services” ఎంపిక చేసుకుని హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే మార్కుల మెమో పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాలను ప్రశాంతంగా పరిశీలించాలని, ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైతే అధికారిక వెబ్‌సైట్లను తిరిగి ప్రయత్నించాలని సూచించారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట..

బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన...

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

More like this

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట..

బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన...

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...