తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్ టౌన్:

పార్లమెంట్ సమావేశంలో బీజేపీ ఎంపీ Tejasvi Surya తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో ఎన్టీఆర్ కూడలి వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తేజస్వి సూర్య దిష్టిబొమ్మకు నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా పెద్దగా చేసిందేమీ లేదని విమర్శించారు.

అదేవిధంగా తెలంగాణకు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని, డిలిమిటేషన్ అంశంలో కూడా రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సుజాత, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జాదవ్ వసంత్ రావు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest articles

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్ 14 ద్విచక్ర వాహనాలు సీజ్ ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన...

More like this

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...