వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం లభించింది. ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి సుమారు లక్షన్నర రూపాయల వ్యయంతో నూతనంగా బోర్లు త్రవ్వించి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించడంతో స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది.

వివరాల్లోకి వెళితే, స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్‌ల సమక్షంలో రెండు కొత్త బోర్లు ఏర్పాటు చేయగా, శుక్రవారం వాటిని పైప్‌లైన్‌తో అనుసంధానం చేసి ప్రజలకు త్రాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరవ వార్డులో నెలకొన్న నీటి సమస్య పూర్తిగా తొలగినట్లు స్థానికులు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు భరత్, నరేందర్ మాట్లాడుతూ, వర్కటం జగన్నాథ్ రెడ్డి సేవలను కొనియాడారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందిస్తూ నీటి సమస్యను పరిష్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయనను “ఆధునిక భగీరథుడు”గా అభివర్ణిస్తూ ఘనంగా సన్మానించారు.

స్థానిక ప్రజలు కూడా వీజేఆర్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.. https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బీఆర్ఎస్ బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరికలు

బీఆర్ఎస్, బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన బోథ్ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ నాయకులు మన భారత్,జూలై 20 తలమడుగు: బోథ్ నియోజకవర్గ...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక మన భారత్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన...

జిల్లాకు వర్ష హెచ్చరిక..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం...

మూడు నెలల రేషన్ బియ్యం .!

ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.. లబ్ధిదారులకు కీలక సమాచారం మన భారత్, హైదరాబాద్: ప్రస్తుతం ఎల్‌నినో...

More like this

బీఆర్ఎస్ బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరికలు

బీఆర్ఎస్, బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన బోథ్ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ నాయకులు మన భారత్,జూలై 20 తలమడుగు: బోథ్ నియోజకవర్గ...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక మన భారత్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన...

జిల్లాకు వర్ష హెచ్చరిక..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం...