కాలిపోయిన జొన్న పంట.. రైతుకు ఎమ్మెల్యే అండ

Published on

-Advertisement-

మన భారత్ , తలమడుగు: 

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో జరిగిన విషాదకర ఘటనలో రైతు అజీస్ పటేల్‌కు చెందిన జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై స్పందించిన బోథ్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం గ్రామానికి చేరుకుని కాలిపోయిన పంట పొలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జొన్న పంట పూర్తిగా దగ్ధమవడంతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ఈ ఘటన చాలా బాధాకరమని, రైతులు అధైర్యపడకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, తప్పకుండా పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇకపోతే, కేవలం వరి పంటలకే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో పండించే అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫసల్ భీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు అభిరాం రెడ్డి, బోథ్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్, బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

రైతులకు ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

 

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...