మన భారత్, తెలంగాణ:
కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల మలం నీటిపై తేలడం సాధారణమేనని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సేథీ తెలిపారు. అయితే ఇది తరచుగా జరుగుతూ, మలం జిడ్డుగా (స్టిక్కీగా) కనిపిస్తే మాత్రం జీర్ణక్రియలో లోపం ఉందని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కొవ్వులు పూర్తిగా శరీరంలో ఆవిర్భవించక మలంలో కలిసిపోతాయి. దీనివల్ల మలం తేలికగా మారి నీటిపై తేలే అవకాశం ఉంటుంది.
డాక్టర్ సేథీ వివరాల ప్రకారం, ఈ లక్షణాలు కొనసాగుతూ ఉంటే అది Celiac disease (సెలియాక్ వ్యాధి) సంకేతంగా ఉండొచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా బరువు తగ్గడం, కడుపు నొప్పి, అలసట వంటి లక్షణాలు కూడా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
ఇక ఆధునిక జీవనశైలిలో చాలామంది టాయిలెట్లో ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ గడపడం వల్ల మలద్వార సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. దీని వల్ల piles, fissures వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కాబట్టి టాయిలెట్ వినియోగాన్ని అవసరానికి మాత్రమే పరిమితం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
