జర్నలిస్టులకు శుభవార్త..!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక వెల్లడించారు. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతోందని, దీనిపై వస్తున్న వివిధ వార్తలతో జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని ఆమె స్పష్టం చేశారు.

ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై సమగ్ర పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అక్రెడిటేషన్ కోసం జర్నలిస్టులు తప్పనిసరిగా ఆన్లైన్‌లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలోనే మొత్తం అక్రెడిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఇక జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే అక్రెడిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

అర్హత ఉన్న జర్నలిస్టులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...