రోడ్డు ప్రమాదంలో 10 మంది సజీవదహనం..

Published on

-Advertisement-

ప్రకాశం జిల్లా, మన భారత్:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పలకల క్వారీ సమీపంలో టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే టిప్పర్ డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులో ముందు భాగంలో కూర్చున్న సుమారు 22 మంది ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే వెనుక భాగంలో కూర్చున్న వారు, పైన పడుకున్న ప్రయాణికులు మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు.

ఈ బస్సు జగిత్యాల నుంచి వింజమూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగం మరియు ప్రమాదకరమైన మూలమలుపు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను వెలికితీసేందుకు అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...