రోడ్డు ప్రమాదంలో 10 మంది సజీవదహనం..
ప్రకాశం జిల్లా, మన భారత్: ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు పలకల క్వారీ సమీపంలో టిప్పర్ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే టిప్పర్ డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని...