వంటగ్యాస్ బుకింగ్ గడువు మళ్లీ పెంపు!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం కారణంగా వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేయకుండా నిర్ణీత గడువు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ ప్రభావంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై కూడా పడింది. చాలా చోట్ల వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే ఉన్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ కంపెనీలు గ్యాస్ బుకింగ్ రూల్స్‌ను మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 35 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకోవాలి.

ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులు ప్రతి 45 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ నియమాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ వర్తిస్తాయని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.

నిర్దేశిత గడువుకు ముందే గ్యాస్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వినియోగదారులు పుకార్లను నమ్మకుండా, అవసరానికి అనుగుణంగా మాత్రమే గ్యాస్ వినియోగించాలని, నియమాలను పాటించాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి.

Latest articles

రేపు ప్రజావాణి రద్దు.!

మన భారత్, ఆదిలాబాద్ మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో...

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...

More like this

రేపు ప్రజావాణి రద్దు.!

మన భారత్, ఆదిలాబాద్ మంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సోమవారం ప్రజావాణి రద్దు ఆదిలాబాద్, జూలై 19: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో...

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...