అదిలాబాద్, మన భారత్ :
రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ సాయిచరణ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగగా, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై పరస్పర చర్చలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి యువ నాయకుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన అదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డ్ నం. 40 నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సాయిచరణ్ గౌడ్ను నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. యువ నాయకుడిగా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం అని కొనియాడారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాసేవే రాజకీయ నాయకుడి ప్రధాన ధ్యేయమని, అదే దిశగా కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని సాయిచరణ్ గౌడ్కు సూచనలు చేశారు.

సాయిచరణ్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పెద్దల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని అన్నారు.

ఈ సమావేశం ద్వారా యువ నాయకత్వం, సీనియర్ నాయకత్వం మధ్య సమన్వయం మరింత బలపడిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
