మన భారత్, ఆదిలాబాద్/మహారాష్ట్ర సరిహద్దు:

రోడ్డు ప్రమాదంలో తాంసి మండలానికి చెందిన ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్) సంతోష్ తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని యావత్మాల్లో బంధువులను కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

పిప్పర్వాడ ప్రాంతం సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సంతోష్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంతోష్ను నిజామాబాద్కు తరలించినట్లు తెలిసింది.

ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ప్రమాదాల నివారణకు రహదారుల భద్రతపై మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

